సాక్షి ఎఫెక్ట్ : విజిలెన్స్ దాడులు

21 Oct, 2016 20:17 IST|Sakshi
సాక్షి ఎఫెక్ట్ : విజిలెన్స్ దాడులు
శ్రీకాకుళం : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇసుక మాఫియాపై సాక్షి కథనాలతో శ్రీకాకుళం జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక ర్యాంపులపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. 
 
కొత్తూరు మండలం మాతల పెనుగోటివాడ ఇసుక ర్యాంపులపై అధికారులు దాడులు చేశారు. రైతుల ముసుగులో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను అధికారులు గుర్తించారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహరంపై గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపై విజిలెన్స్ అధికారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 
మరిన్ని వార్తలు