'టీటీడీ భద్రతను సీఐఎస్ఎఫ్ కు అప్పగించాలి'

7 Dec, 2014 09:20 IST|Sakshi

హైదరాబాద్: టీటీడీ భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించాలని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం విజయసాయి రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం చుట్టూ 10.3 చదరపు మైళ్ల దూరంలో మహాప్రాకారాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూమిలో టీటీడీ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని విన్నవించారు. శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు హెచ్సీఎల్ అధినేత శివనాడార్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చారు.
 

మరిన్ని వార్తలు