‘కూటమి రాజకీయాల్లో తలమునకలైన నీరో చక్రవర్తి’

12 Nov, 2018 17:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో కరువు తాండవిస్తోందని, 320 మండలాలను  కరువు కాటేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆదుకునే దిక్కులేక సీమలో వేల సంఖ్యలో వలసలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అవుతున్నాయని, అన్నదాతల ఆక్రోశం, ఆవేదన పట్టించుకోని నీరో (నారా) చక్రవర్తి మాత్రం కూటమి రాజకీయాల్లో తలమునకలై పోయారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు