107వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

7 Mar, 2018 20:36 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 107వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. గురువారం ఉదయం వైఎస్‌ జగన్‌ సంతరావురు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాధాకృష్ణ నగర్‌, అంబేద్కర్‌ కాలనీ మీదుగా వేటపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జననేత అడుగులో అడుగు వేస్తూ ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ తన 106వ రోజు పాదయాత్రను ముగించారు. ఇవాళ పాదయాత్రలో ఆయన 15.3 కిలోమీటర్లు నడిచారు. హనుమెజిపాలెం, జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం, కేశవరపుపాడు, రంగప్పనాయుడుపాలెం క్రాస్‌, నందిగుంటపాలెం మీదుగా సంతరావురు వరకు పాదయాత్ర సాగింది. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డ ఇప్పటివరకు  1,444.7 కిలోమీటర్లు నడిచారు.

>
మరిన్ని వార్తలు