నేడు తునిలో బహిరంగ సభ

11 Aug, 2018 07:14 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో  కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్న వారికి భరోసానిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం డీజేపురం నుంచి ప్రారంభం కానుంది. తుని నియోజకవర్గంలోని కొత్తవెలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి, తునిలో పాదయాత్ర సాగుతుంది.

తునిలో బహిరంగ సభ : ప్రజా సంకల్పయాత్ర 234వ రోజుకు చేరుకుంది. జూన్‌ 12న జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు అడుగడుగునా విశేషంగా స్వాగతం పలుకుతున్నారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తునిలో నిర్వహించే బహిరంగ సభలోప్రసంగించనున్నారు.

మరిన్ని వార్తలు