భీమిలి నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర

15 Sep, 2018 18:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర భీమిలి నియోజకర్గంలోకి విజయవంతగా ప్రవేశించింది. 262వ రోజు పాదయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర ముగించుకున్న వైఎస్‌ జగన్‌ అడవివరం వద్ద భీమిలి నియోజవర్గంలోకి ప్రవేశించించారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానుల ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆ ప్రాంత ప్రజలకు జగన్‌ వద్ద వాపోయారు.  

మరిన్ని వార్తలు