సాక్షి, అనంతపురం: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 26వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఆయన చేపట్టిన పాదయాత్ర ఇవాళ అనంతపురం జిల్లా బసినేపల్లి మీదగా గుత్తి వరకూ సాగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్...సోమవారం సాయంత్రం గుత్తి సెంటర్లో ప్రజలను ఉద్దేశించారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ 11.3 కిలోమీటర్లు మేర కొనసాగింది.
27వ రోజు ప్రజాసంకల్పయాత్ర
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 27వ ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖారారు అయింది. ఆయన మంగళవారం ఉదయం గుత్తి నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. అవులంపల్లి క్రాస్, పెద్దవడుగురు మీదగా చిన్నవడుగురు వరకూ కొనసాగనుంది.