321వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

15 Dec, 2018 08:09 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 321వ రోజు శనివారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలోని అలికం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్‌ జగన్‌ దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అక్కడి నుంచి నైరా, కరిమిల్లిపేట క్రాస్‌, రోణంకి క్రాస్‌, భైరి జంక్షన్‌, కరజడ మీదుగా నర్సన్నపేట నియోజక వర్గంలోకి ప్రవేశించి మడపం, దేవాడి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తారు. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు.

అమరజీవికి ఘన నివాళి
నేడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన రోజు కావడంతో ఆయనకు వైఎస్‌  జగన్‌ నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అమరజీవి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు