‘సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులే’

12 Aug, 2018 16:11 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, ప్రకాశం : సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులేనని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్‌ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ.. మన ప్రభుత్వం వస్తే ఏం మేలు జరుగుతుందో ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ గెలుపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో పార్టీ మరింత మద్దతును కూడగట్టాలని సూచించారు. 

మరిన్ని వార్తలు