'పుష్కర పనులు బినామీ వ్యక్తులకు అప్పగించారు'

16 Jul, 2015 14:21 IST|Sakshi

విశాఖపట్నం : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరాల దుర్ఘటన, అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కరాల పనులను బినామీ వ్యక్తులకు అప్పగించిందని ఆయన ఆరోపించారు. బినామీ వ్యక్తులతో పనులు చేయించి అవినీతికి పాల్పడ్డారని ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు