గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ

26 Nov, 2015 13:04 IST|Sakshi

గుంటూరు: భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

స్థానిక లాడ్జి సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ  వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వానికి సూచించారు. అక్కడ నుంచి ర్యాలీగా  శంకర్‌విలాస్, ఓవర్‌బ్రిడ్జీ, హిందూ కళాశాల కూడలి మీదుగా వెంకటేశ్వరవిజ్ఞాన మందిరానికి చేరుకుంటారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.    
 
 

మరిన్ని వార్తలు