హీరో బైక్స్‌ ధరల పెంపు

22 Dec, 2017 12:36 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటో కార్ప్  బైక్‌ ​ లవర్స్‌కు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది.  తాజాగా పాషన్‌, స్ప్లెండర్‌ మోడల్‌ కొత్త వాహనాలను లాంచ్‌ చేసిన కంపెనీ తాజాగా  వాహనాల ధరలను అమాంతం పెంచేసింది.  పెరుగుతున్న ఇన్‌ పుట్‌ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది.  

 హీరో   అన్ని మోడల్స్‌ ఎక్స్‌ షో రూం ధరలు పెరగనున్నాయి.    జనవరి 1, 2018నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.    దాదాపు మోడల్‌కు రూ.400  పెరగనుంది.  బైక్‌ మోడల్‌,  మార‍్కెట్‌ ఆధారంగా ఈ పెంపు ఉంటుందని వివరించింది.  కాగా  ఈ నేపథ్యంలోనే గురువారం విడుదల చేసి పాషన్‌ ప్రో, ఎక్స్‌ ప్రో, స్ల్పెండర్‌ ధరలను  రివీల్‌ చేయలేదు.

మరిన్ని వార్తలు