ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!

6 Feb, 2016 01:55 IST|Sakshi
ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!

కస్టమ్స్ సుంకం మినహాయింపుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20 శాతం వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేక్ ఇన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖలోని ఫార్మా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం ప్రభుత్వం వైద్య పరికరాలపై సుంకాలను 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది.

>
మరిన్ని వార్తలు