న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ఆటోమోటివ్ తయారీ ప్లాంట్లను జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8–17 రోజుల వరకు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆటో పరిశ్రమలో విక్రయాలు గణనీయంగా తగ్గిపోయి.. నిల్వలు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 9న ప్లాంట్ను మూసివేసినట్లు స్పష్టంచేసింది.