ఎం అండ్‌ ఎం ఎక్స్‌యూవీ500 పెట్రోల్‌ వెర్షన్‌ లాంచ్‌

5 Dec, 2017 18:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహీంద్ర అండ్‌మహీంద్ర కొత్ వెర్షన్‌ ఎస్‌యూవీలాంచ్‌ చేసింది.  పెట్రోల్ వెర్షన్‌లో ఎస్‌యూవీ ఎక్స్‌ యూవీని 500 ను  విడుదల  చేసింది. దీని  రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది.
 
తాజా నివేదిక ప్రకారం 6స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త వెహికల్‌ లభించనుంది.  2.2 లీటర్ mHawk పెట్రోల్ ఇంజిన్‌తో,   140 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.  అలాగే స్టాటిక్ బెండింగ్ హెడ్‌ లైట్లు, , క్రూయిస్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్‌ లాంటి ఇతర  ప్రధాన ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ లభ్యం.


పెట్రోల్ వేరియంట్  కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఎక్స్‌యూవీ500   అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఎంఅండ్‌ ఎం చీఫ్ సేల్స్ & మార్కెటింగ్  ఆఫ్ రామ్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు