మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్

29 Jul, 2015 01:00 IST|Sakshi
మహీంద్రా స్కార్పియో ఏటీ వేరియంట్

న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏటీ) ఫీచర్‌తో సరికొత్త న్యూ జనరేషన్ స్కార్పియోను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13.13 లక్షల నుంచి రూ.14.33 లక్షల (ఎక్స్‌షోరూం ఢిల్లీ) మధ్యలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏటీ వేరియంట్ ఎస్‌యూవీ స్కార్పియో టాప్-ఎండ్ ఎస్10 వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగదారులకు అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీణ్ షా తెలిపారు.

మరిన్ని వార్తలు