మారుతి ఎర్టిగా 2018.. బుకింగ్స్‌ నేటి నుంచే

14 Nov, 2018 12:38 IST|Sakshi

నవంబరు 21న ఎర్టిగా (ఎంపీవీ) 2018 లాంచ్‌

ప్రీ బుకింగ్స్‌ నేటి నుంచే ప్రారంభం

రూ.11వేలతో కొత్త ఎర్టిగా బుకింగ్‌

సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్‌ మోడల్‌ కారు ఎర్టిగాను న్యూ అవతార్‌లో లాంచ్‌ చేయనుంది. సెవన్‌ సీటర్‌ మల్టీ పర్సస్‌ వెహికల్‌ (ఎంపీవీ) కొత్త ఎర్టిగా 2018ను నవంబరు 21ల లాంచ్‌ చేయనున్నామని మారుతి ఒక ప్రకటనలో వెల్లడించింది.  ఈ న్యూ ఎర్టిగా  ఎల్‌, వీ, జెడ్‌, జెడ్‌ + అనే నాలుగు వేరియంట్లలో మార్కెట్లో  ఈనెల 21న లాంచ్‌ చేయనుంది.  అలాగే ఈ వాహనాల ప్రీ బుకింగ్స్‌ను నేటి (నవంబరు 14, బుధవారం) నుంచి ప్రారంభించింది. కేవలం రూ.11వేలు చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు.

ఇక ధర విషయానికి వస్తే లాంచింగ్‌  సందర‍్భంగా  మారుతి వెల్లడించనుంది. అయితే పాత మోడల్‌ ఎర్టిగాతో  పోలిస్తే కొత్త ఎర్టిగా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా.  రూ 6.34- 10.69 లక్షలు (ఎక్స్ షోరూమ్ న్యూఢిల్లీ)  మధ్య  ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  ఎర్టిగా  2018 ( ఎంపీవీ) 1.5 లీటర్‌ పెట్రోలు ఇంజీన్‌, 1.3 లీటర్‌ డీజిల్‌ రెండు వెర్షన్‌లలో, అయిదు రంగుల్లో  లభ్యంకానుంది.  

మరిన్ని వార్తలు