మెర్సిడెస్‌ ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌’లో కొత్త వెర్షన్‌

5 May, 2018 00:43 IST|Sakshi

ప్రారంభ ధర రూ.1.05 కోట్లు

గ్రేటర్‌ నోయిడా: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్‌–బెంజ్‌’ తాజాగా తన ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌’  సెడాన్‌ కారులో కొత్త వెర్షన్‌ ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌ 4 మేటిక్‌ ప్లస్‌’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. తాజా కొత్త వెర్షన్‌తో కలుపుకొని కంపెనీ దేశంలో మొత్తంగా 14 ఏఎంజీ మోడళ్లను విక్రయిస్తోంది. ‘కస్టమర్ల నుంచి ఏఎంజీ మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ ఏడాదిలో మరిన్ని ఏఎంజీ మోడళ్లను, ఇతర కార్లను మార్కెట్‌లోకి తీసుకువస్తాం’ అని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్‌ ఫోల్గర్‌ తెలిపారు. ‘ఏఎంజీ ఈ–63 ఎస్‌ 4 మేటిక్‌ ప్లస్‌’లో 4 లీటర్‌ ట్విన్‌టర్బో వీ8 ఇంజిన్‌ను అమర్చామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు