ఎయిర్‌టెల్‌లో వాటాలు అమ్మేసిన మెరిల్‌ లించ్‌

17 Jan, 2018 00:23 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌ తనకున్న వాటాల్లో సింహ భాగాన్ని విక్రయించేసింది. ఎయిర్‌టెల్‌లో మెరిల్‌లించ్‌కు డిసెంబర్‌ త్రైమాసికం ముగిసే నాటికి 5.09 కోట్ల షేర్లుండగా, వీటిలో 3.87 కోట్ల షేర్లను మంగళవారం సగటున ఒక్కో షేరును రూ.499.1 చొప్పున విక్రయించింది. ఇది 0.97 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను ఎస్‌ఆర్‌ఎస్‌ పార్ట్‌నర్స్‌ (కేమాన్‌) ఎల్‌ఎల్‌సీ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,931.23 కోట్లు. బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.43 శాతం నష్టంతో రూ.496.90 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు