హైదరాబాద్‌లో ‘మెట్రో’ మరో ఔట్‌లెట్‌

18 May, 2017 01:59 IST|Sakshi
హైదరాబాద్‌లో ‘మెట్రో’ మరో ఔట్‌లెట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హోల్‌సేల్‌ విక్రయంలో ఉన్న మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ హైదరాబాద్‌లో నాల్గవ ఔట్‌లెట్‌ను బుధవారం ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా మెట్రో స్టోర్ల సంఖ్య 24కు చేరుకుంది. బోయినపల్లి సమీపంలోని సుచిత్ర జంక్షన్‌ వద్ద 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పారు. ఈ ఔట్‌లెట్‌ రాకతో కొత్తగా 350 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో మరింత విస్తరణకు ఆస్కారం ఉందని కంపెనీ ఎండీ అరవింద్‌ మెదిరట్ట తెలిపారు. భారత్‌లో మెట్రోకు 11 లక్షల పైచిలుకు వర్తకులు కస్టమర్లుగా ఉన్నారు. ఇందులో 2 లక్షల మందికిపైగా హైదరాబాద్‌లో ఉన్నారు. ఇప్పటికే భాగ్యనగరిలో కూకట్‌పల్లి, ఉప్పల్, శంషాబాద్‌లో మెట్రో కేంద్రాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు