మార్కెట్‌లోకి ‘మోటో సీ ప్లస్‌’ ధర రూ.6,999

20 Jun, 2017 00:38 IST|Sakshi
మార్కెట్‌లోకి ‘మోటో సీ ప్లస్‌’ ధర రూ.6,999

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మోటరోలా’ తాజాగా ‘మోటో సీ ప్లస్‌’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్‌ నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ‘మోటో సీ ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్‌లో ఐదు అంగుళాల స్క్రీన్, 1.3 గిగాహెర్ట్‌  క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ మొమరీ, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్లు జూన్‌ 20 నుంచి కేవలం ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు