లాభాల్లో సూచీలు : ఎయిర్‌టెల్‌ జోరు

19 May, 2020 13:41 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మూడు రోజుల నష్టాలనుంచి కొలుకున్న కీలక  సూచీలు మంగళవారం 2 శాతానికి పైగా పెరిగాయి. సెన్సెక్స్‌ 675 పాయింట్లకు పైగా లాభపడగా,  9021 వద్దకు చేరుకుంది. ప్రస్తుతం 381 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ 30417 వద్ద,  నిఫ్టీ​ 121 పాయింట్లు    లాభంతో 8934 వద్ద కొనసాగుతోంది.  ప్రధానంగా బ్యాంకు నిఫ్టీ నష్టాల్లోకి జారుకుంది.

ఫైనాన్షియల్ సర్వీసెస్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్‌లో లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి, ఐటీ షేర్లు స్వల్పంగా నష్టపోతున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్   భారీగా లాభపడుండగా, భారతి ఎయిర్‌టెల్, ఒఎన్‌జిసి, టాటా మోటార్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్‌  ఇతర టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేటు రంగ టెలికాం మేజర్ తన ఆదాయాన్ని నివేదించిన ఒక రోజు తర్వాత భారతి ఎయిర్‌టెల్ షేర్లు  10 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు