లాభాల జోరు, 12150 పైకి నిఫ్టీ

29 Jan, 2020 14:43 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.  గత రెండురోజుల నష్టాలకు చెక్‌ చెప్పిన సూచీలు ఆరంభంలోనేల  లాభాల పట్టాయి.అనంతరం మరింత ఎగిసిన కీలక సూచీ సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 105 పాయింట్లు ఎగిసి 12157 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు కూడా ఇదే  జోరుతో కొనసాగుతోంది. దాదాపుఅన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. ఫలితాల ప్రభావంతా బజాజ్‌  ఫిన్‌ సర్వ్‌ టాప్‌ విన్నర్‌గా ఉంది.  టాటా మోటార్స్‌,  ఐటీసీ, నెస్లే,  టాటా స్టీల్‌, లార్సెన్‌, టెక్‌ మహీంద్ర, హీరో మోటో లాభపడుతుండగా, ఐషర్‌  మోటార్స్‌, డా.రెడ్డీస్‌, టీసీఎస్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌,  టైటన్‌, భారతి ఎయిర్‌టెల్‌  నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు