బలహీనంగా స్టాక్‌ మార్కెట్లు 

15 Jan, 2020 09:13 IST|Sakshi

సాక్షి, ముంబై:   దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో వెంటనే నష్టాల్లోకి మళ్లాయి.   సెన్సెక్స్‌  105 పాయింట్లు నష్టంతో , నిఫ్టీ 30 పాయింట్లు  బలహీనంతో వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.   బ్యాంక్‌, మెటల్‌  షేర్లు అమ్మకాల  ఒత్తిడిని  ఎదుర్కొంటున్నాయి.  ఫలితాల ప్రభావంతో  విప్రో నష్టపోతుండగా, మిగిలిన ఐటీ షేర్లు   స్వల్పంగా లాభపడుతున్నాయి.   టైటన్‌, రిలయన్స్‌, గెయిల్‌, భారతి  ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా టాప్‌ విన్నర్‌గా కొనసాగుతోంది.  టాటా స్టీల్‌ , సెయిల్‌ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

  పాఠకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
 

మరిన్ని వార్తలు