హైదరాబాద్: లఘు, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ).. 2014 ఏడాదికి సంబంధించిన జాతీయ అవార్డుల దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని డిసెంబర్ 14 నుంచి జనవరి 11 వరకు పొడిగించింది. తయారీ, సర్వీసెస్ రంగాల్లో అసాధారణ ప్రతిభ, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, నాణ్యమైన ఉత్పత్తులు, మేనుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ వంటి విభాగాల్లో అవార్డులను అందిస్తామని ఎంఎస్ఎంఈ ఒక ప్రకటనలో తెలిపింది.