4జీ ఫోన్లపై వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

14 Mar, 2018 12:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ వొడాఫోన్  ఇండియా ఆకర్షణీయమైన  ఆఫర్‌ ప్రకటించింది. ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీకి చెందిన 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు 2,200 రూపాయల వరకు  క్యాష్‌బ్యాక్‌  ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు తమ మధ్య ఒక అంగీకారం కుదిరిందని ఇరు సంస్థలు మంగళవారం  ఒక  ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

రూ. 6,990 - రూ.14,990 మధ్య టెక్నో ఐ సిరీస్‌  మొబైల్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు  ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.  ఈ ఆఫర్ పొందేందుకు కస్టమర్లు  మార్చి 14వ తేదీనుంచి జూన్ 30, 2018 వరకు ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలి. అయితే పాత, కొత్త  ప్రీపెయిడ్‌ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందాలంటే  నెలకు రూ.150 చొప్పున 18నెలలపాటు రీచార్జ్‌ చేసుకోవాలి. పిదప మొదటి విడతగా రూ.900, మరో 18నెలలపాటు రూ.150 రీచార్జ్‌పై  మిగిలిన రూ.1300 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తుంది.  ఈ మొత్తం నగదును  వోడాపోన్‌ ఎం-పైసా వాలెట్‌లో  జమ చేస్తుంది. దీంతోపాటు  వోడాఫోన్ ప్లే 3నెలల సభ్యత్వం  ఉచితం.  తద్వారా టెక్నో కస్టమర్లు అన్‌ లెమిటెడ్‌ ప్రీమియం వీడియో కంటెంట్‌ను పొందవచ్చు.

మరిన్ని వార్తలు