పన్నుల చెల్లింపు సులభతరం చేస్తున్నాం

26 Jun, 2015 00:45 IST|Sakshi

న్యూఢిల్లీ : పన్నుల చెల్లింపుల విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నామని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్‌పర్సన్ అనితా కపూర్ తెలిపారు. తద్వారా పన్ను చెల్లింపుదారులు.. ఐటీ విభాగం కార్యాలయాలకి అసలు వెళ్లాల్సిన అవసరమే లేకుండా చూసేలా ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. చట్టాలను సక్రమంగా పాటించేందుకు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించే విధంగా సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నామని వివరించారు.

ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా సామాన్య చెల్లింపుదారులు తమంతట తామే ఫైలింగ్ చేసేంత సులభతరంగా ప్రక్రియను చేయాలని భావిస్తున్నట్లు అనితా కపూర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు