-

నేడు దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

29 Jan, 2018 09:11 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా కాలిబాట భక్తులకు 2 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాగా, సోమవారం వృద్ధులు,‌‌‌‌ దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం చంటి పిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ఉచిత ప్రత్యేక దర్శనం ఉంటుంది.

మరిన్ని వార్తలు