కార్తీక శోభ | Sakshi
Sakshi News home page

కార్తీక శోభ

Published Mon, Nov 27 2023 1:24 AM

జ్వాలా తోరణం కింద శివపార్వతుల ఉత్సవమూర్తులను తీసుకొస్తున్న ఆలయ చైర్మన్‌, ఈఓ, అధికారులు  - Sakshi

కాణిపాకం(యాదమరి): కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో, అనుబంధంగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాణిపాకం ఆలయ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈఓ వెంకటేశు కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రధాన ఆలయంలో ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వారు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. అలాగే దీపాలను ఊరేగింపుగా స్వామివారి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శివలింగం రూపంలో దీపాలను, జ్వాల తోరణాలను శాస్త్రోక్తంగా పూజలు చేసి వెలిగించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను జ్వాలా తోరణం కింద ఉంచి పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.

జ్వాలా తోరణాన్ని వెలిగిస్తున్న ఆలయ అధికారులు
1/2

జ్వాలా తోరణాన్ని వెలిగిస్తున్న ఆలయ అధికారులు

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement