చిత్తూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఆయన గుండుపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం పాదయాత్ర గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు చంద్రగిరి నియోజకవర్గంలోని అనుప్పల్లి పంచాయతీ నెమ్మలగుంటపల్లిలో రైతులతో వైఎస్ జగన్ ఆత్మీయ సదస్సు నిర్వహించనున్నారు. కాగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకుని గత నెల 28న చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నిన్న చిత్తూరు జిల్లాలో 800 కిలోమీటర్ల మైలు రాయి దాటింది.