కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్‌ చేసి..

2 Jan, 2018 15:06 IST|Sakshi

హైద్రాబాద్ : విద్యార్థి సంఘ నాయకులం అని చెప్పి రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్‌ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. వటపల్లి రాజేష్, అజరుద్దీన్, ప్రసాద్ అనే వ్యక్తులు కళాశాల యాజమాన్యాన్ని రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్‌పేట్ పోలీసులు ఈ ముగ్గురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు