సాక్షి, హైదరాబాద్: హయత్నగర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 11మంది పాత నేరస్థులు, ఐదుగురు మహిళా నేరస్థులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని 28 బైక్లు, 17 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం, గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.