చండీఘడ్: తనపై చేయిచేసుకున్నాడనే కక్ష్యతో ఓ విద్యార్థి తన సీనియర్ను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన హర్యాన, పంచాలకులలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రభుత్వ పాఠశాల్లో 11వ తరగతి చదువుతున్న వికాస్(17)ను అదే స్కూళ్లో 9వ తరగతి చదవుతున్న ఓ విద్యార్థి తన స్నేహితుల సాయంతో దాడి చేసి చంపేశాడు. ఈ ఘర్షణలో వికాస్పై కత్తితో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పాయాడు. ఈ ఘర్షణలో వికాస్ రక్షించే ప్రయత్నం చేసిన అతని స్నేహితులు సైతం గాయపడ్డారు. నిందితుడు తన స్నేహితుని మొబైల్ దొంగలించాడని వికాస్ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో వికాస్పై కక్ష్యపెంచుకున్న నిందితుడు తన స్నేహితుల సాయంతో సోమవారం స్కూల్ అనంతరం దాడిచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని అరెస్ట్ చేసి జూవైనల్ హోంకు తరలించారు.