ప్రియురాలితో కలిసి కాంగ్రెస్‌ నేత ఆత్మహత్య

24 Feb, 2018 18:49 IST|Sakshi

సాక్షి, చెన్నై ‌: కాంగ్రెస్‌ పార్టీ నేత తన ప్రియురాలితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిదంబరం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. కడలూర్‌ జిల్లా చిదంబరం సమీపం భువనగిరి సమీపంలో ఉన్న మేలకీరపాళయానికి చెందిన చంద్రహాసన్ కుమారుడు సహాదేవన్‌ (43) కాంగ్రెస్‌ పార్టీ నేత. ఇతని భార్య చిత్ర. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా, భర్తను విడిచి తిరుచ్చిలో నివసిస్తూ వస్తున్న చిత్ర, అక్కడ ఉన్న ఓ ఆస్పత్రిలో పని చేస్తుంది. 

భార్య, భర్తల మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాల కారణంగా స్థానికంగా ఉన్న మురుగేశ్వరి అనే మహిళ భర్తను విడిచి ఒంటరిగా నివసిస్తుంది. ఈ స్థితిలో, సహాదేవన్‌కి, మురుగేశ్వరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాలక్రమేణ వివాహేతర సంబంధంగా మారింది. వీరిద్దరు కలిసి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీని ప్రకారం వివాహం చేసుకోకుండానే భార్య, భర్తలుగా తిరుప్పనినత్తమ్‌ గ్రామంలో ఓ ఇంట్లో నివసిస్తూ వచ్చారు. అనంతరం మురుగేశ్వరి గర్భం దాల్చింది. గత రెండు రోజులుగా వీరి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. దీంతో శుక్రవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీని గురించి భువగిరి పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్ళి చూశారు.  సహాదేవన్‌ ఉరి వేసుకుని మృతి చెందాడు. అతనికి సమీపంలో నేలమీద మురుగేశ్వరి మృతదేహం పడిఉంది. వీరిద్దరి దేహాలు కుళ్లి పోవడంతో స్థానికులకు దుర్వాసన వచ్చింది. సహాదేవన్‌కి అప్పుల సమస్యలు ఉన్నందున ఒత్తిడి కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు