రిమ్స్ వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు

7 Apr, 2020 11:10 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యహరించిన రిమ్స్‌ వైద్యుడిపై ఆస్పత్రి డైరెక్టర్‌ బలరాం నాయక్‌ ఫిర్యాదు చేశారు. మర్కజ్‌ సన్నహక సమావేశానికి వెళ్లొచ్చి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్యుడు విధులకు హాజరయ్యాడు. సమాచారం గోప్యంగా ఉంచి.. నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వహించిన డాక్టర్‌పై సెక్షన్‌ 176, 188, 270, 271 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వైద్యుడు క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నాడు. (ఫేక్‌ న్యూస్‌ పోస్ట్‌ చేసిన కిరణ్‌ బేడీ.. నెటిజన్ల మండిపాటు)

>
మరిన్ని వార్తలు