సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని తాండూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు భార్యాభర్తలను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని సీతారాం పేట్కు చెందిన భార్యాభర్తలను దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దాయాదుల మధ్య ఆస్తి తాగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.