పెన్షన్‌ దొంగల ముఠా అరెస్ట్‌ !

17 Sep, 2019 17:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీ వృద్ధుల ఆసరా పెన్షన్‌ల పథకంలో కుంభకోణానికి పాల్పడిన ముఠాలోని నలుగురిని సైబరాబాద్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ  స్కాంపై హైదరాబాద్‌ కలెక్టర్‌ మానిక్‌ రాజు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళఙతే... పాత బస్తీకి చెందిన 250మంది ఆసరా పెన్షన్‌లను ఈ ముఠా మూడు నెలల నుండి డైవర్ట్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠాలో కీలక పాత్రధారి, ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇమ్రాన్‌ సోహెల్‌ అస్లాం సహాయంతో ఎమ్మార్వో పాస్‌వర్డ్‌తో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కోన్నారు. కాగా 2017లో కూడా అస్లాం పెన్షన్‌ల స్కాంకు పాల్పడటంతో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు