కుమార్తెను గదిలో బంధించిన తల్లి

3 May, 2018 13:35 IST|Sakshi
బాలిక నుంచి వివరాలు సేకరిస్తున్న కానిస్టేబుల్‌

సారవకోట : మండలంలోని వెంకటా పురం గ్రామానికి చెందిన కె.అమూ ల్య(11)ను తల్లి సరోజిని చీకటి గదిలో బంధించి వెళ్లిపోయింది. గదిలో ఊపిరాడకపోవడంతో కేకలు వేసింది. వీటిని గమనించిన స్థానికులు గదికి ఉన్న వెంటిలేటరును తొలగించి బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

అనంతరం వీరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం కోటబొమ్మాళిలో 6వ తరగతి చదువుతోంది. ఎస్‌ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. తల్లికి ఫోన్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించామన్నారు.  

మరిన్ని వార్తలు