ఈవీఎంలు తరలిస్తున్న బస్సు ఢీకొని మహిళ మృతి

7 Dec, 2018 21:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎన్నికల పండుగ ఓ ఇంట్లో విషాదం నింపింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ (ఈవీఎం)లు తరలిస్తున్న బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. బస్సు డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన మహిళ భర్త, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు