కళ్యాణ్‌ జ్యువెల్లర్స్‌పై నకిలీ వార్తలు

31 Mar, 2018 13:14 IST|Sakshi

దుబాయ్‌ : ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్‌ జ్యువెల్లర్స్‌పై అసత్య కథనాలను వ్యాప్తి చెందిస్తున్న ఐదుగురు వ్యక్తులను దుబాయ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్‌ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్‌ క్రైమ్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గతేడాది నవంబర్‌ ఈ మేరకు జ్యువెల్లరీ ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

కళ్యాణ్‌ జ్యువెల్లర్స్‌లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు ఐదుగురు వ్యక్తులు నకిలీవని సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో ఈ పోస్టులను ఎక్కువగా స్ప్రెడ్‌ చేసినట్లు గుర్తించామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు