నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

26 May, 2018 08:39 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... పెళ్లకూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జీపును ...ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వినుకొండ నుంచి తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లపల్లి  మండలం నాయుడుపాలెంకు చెందినవారు. మృతుల్లో డ్రైవర్‌, ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు