సాక్షి, తిరుపతి : ఓ సైకిల్ షాపు యాజమాని వందకోట్లకు పడగలెత్తాడు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం రెండో రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో అతని ఆదాయం దాదాపు రూ. 100 కోట్లు అని తెలింది.
సైకిల్ పంక్చర్లు వేసే అతని ఆదాయం కోట్లలో ఉందని తెలిసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వడ్డీకాసుల వాడి సన్నిధిలో జోరుగా వడ్డీల వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రమేష్ వడ్డీ వ్యాపారంతో జనాలను ఆడుకుంటున్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.