వృత్తి పంక్చర్లు వేయడం.. ఆదాయం 100 కోట్లు !

12 Jul, 2018 15:39 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఓ సైకిల్‌ షాపు యాజమాని వందకోట్లకు పడగలెత్తాడు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు కందిశెట్టి రమేష్‌ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం రెండో రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో అతని ఆదాయం దాదాపు రూ. 100 కోట్లు అని తెలింది.

సైకిల్‌ ​పంక్చర్లు వేసే అతని ఆదాయం కోట్లలో ఉందని తెలిసిన జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వడ్డీకాసుల వాడి సన్నిధిలో జోరుగా వడ్డీల వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రమేష్‌ వడ్డీ వ్యాపారంతో జనాలను ఆడుకుంటున్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు