బురఖా వేసుకొని లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి...అరెస్ట్‌

17 Feb, 2019 10:33 IST|Sakshi

పనాజీ : బురఖా ధరించి మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్‌ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్‌ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విర్గిల్‌ ఫెర్నాండేజ్‌ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్‌ టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్‌ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు