వివాహమైన నెల రోజులకే..

22 Jan, 2019 20:30 IST|Sakshi

సాక్షి, ఆలేరు : ఆలేరులో దారుణం చోటుచేసుకుంది. నవ వధువు  మానస(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా ఆలేరులోని కొల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నెల రోజుల కిందట హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన అబ్బా​యితో మానసకు వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మం‍గళవారం ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మ చేసుకున్నట్టు తెలుస్తోంది. కట్నం విషయంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు