భయంతో మేడపై నుండి దూకిన యువతి

29 Jul, 2019 06:58 IST|Sakshi

భయంతో మేడపై నుండి దూకిన యువతి

కర్ణాటక,యశవంతపుర : సీసీబీ పోలీసులు పబ్‌పై దాడి చేసిన సమయంలో బిల్డింగ్‌పై నుండి పారిపోయే క్రమంలో ఓ యువతి తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న అశోక్‌నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో బ్రిగేడ్‌ పబ్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో ఓ యువతి పారిపోయే క్రమంలో బిల్డింగ్‌పై నుంచి జారి పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో కోమాలోకి వెళ్లింది. యువతి గాయపడిన కేసును పోలీసులు తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు