ఆ.. తండ్రీకూతుళ్లు.. మానవత్వానికి మచ్చ

16 Dec, 2017 11:34 IST|Sakshi

సాక్షి, యమునా నగర్‌ : మానవత్వానికి, విలువలకు మచ్చ తెచ్చేలా హర్యానాలోని తండ్రీకూతుళ్లు ప్రవర్తించారు. కుటుంబ విలువలు, బంధాల పతనానికి పరాకాష్టకు సాక్ష్యంలా వాళ్లు నిలిచారు. స్థానిక యమునా నగర్‌లో ఉంటున్న తండ్రీకూతుళ్ల వికృతత్వం తాజాగా బయటపడింది. ఆడ స్నేహితులను కుమార్తె ఇంటికి తీసుకురాగా తండ్రి వారిపై అత్యాచారం చేసేవాడు. ఈ ఘటననంతా కుమార్తె దగ్గరుండీ వీడియో తీసి డబ్బు కోసం బ్లాక్‌ మెయిల్‌ చేయడం వారికి పరిపాటిగా మారింది. హర్యానా పోలీసు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి.

కుమార్తె.. బాగా డబ్బున్న వారితోనూ, అందంగా ఉండే పేద మహిళలతోనే స్నేహాలు చేస్తుండేది. వారికి బాగా నమ్మకం కుదిరాకా.. ఇంటికి ఆహ్వానించేది. ఇంట్లో కాఫీ, టీ, కూల్‌ డ్రిక్స్‌లో మత్తు మందు కలిపి వారికి ఇచ్చేవారు. తరువాత తండ్రి సీన్‌లోకి ఎంటరయి.. వారిపై అత్యాచారానికి దిగేవాడు. ఈ మొత్తం వ్యవహరాన్ని కుమార్తె దగ్గరుండి మరీ వీడియో తీసేది. తరువాత వీడియోను అడ్డం పెట్టుకుని వారిన డబ్బుకోసం బ్లాక్‌మెయిల్‌ చేసేవారు.

ఇక్కడ మరో దారుణ విషయం ఏమిటంటే అందంగా ఉండే పేద మహిళలను బలవంతంగా వ్యభిరాకూపంలోకి దించారు. వారు వ్యభిచారం చేసి సంపాదించే మొత్తంలో వీరికి కూడా వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే.. వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామంటూ బెదిరించేవారు.

తండ్రీకూతుళ్ల ఉచ్చులో పడి.. అత్యాచారానికి గురయిన మహిళ ధైర్యంగా యమునానగర్‌ పోలీసులను ఆశ్రయించడంతో వీరి బాగోతం బయటపడింది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రీకూతుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. నన్ను కూడా రూప10 వేలు డిమాండ్‌ చేస్తే.. ఇచ్చానని చెప్పారు. మళ్లీమళ్లీ డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తుండడంతో.. పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు