మాందారిపేట శివారులో రోడ్డు ప్రమాదం

27 Aug, 2018 14:40 IST|Sakshi
గాయాలపాలైన సరిత, కీర్తన

కారును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

ఒకే కుటుంబానికి చెందిన  ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం

శాయంపేట (భూపాలపల్లి) : మండలంలోని మాందారిపేట శివారులోని గుట్టల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన నడిపెల్లి కృష్ణారావు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హన్మకొండలో ఉంటున్నాడు. ఈ క్రమంలో పరకాలలోని ఓ శుభకార్యానికి తన భార్య సరిత, కూతురు కీర్తనలతో కలిసి వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హన్మకొండకు వెళుతుండగా మాందారిపేట శివారులో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్‌ చేస్తున్న కృష్ణారావు సీటుబెల్ట్‌ పెట్టుకోవడంతో కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకుంది. దీంతో కృష్ణారావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే అతడి బంధువులు వెంటనే మరో కారులో వారిని హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల రాజబాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించారు.

మరిన్ని వార్తలు