రణరంగంగా మారిన రావికంపాడు

22 Apr, 2019 14:33 IST|Sakshi

భూ వివాదం విషయంలో ఇరువర్గాలు దాడులు

రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు, రావికంపాడులో ఉద్రిక్తత

సాక్షి, చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడులో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడెకరాల భూమికి సంబంధించి ఈ వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు గ్రామంలోనే మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసులు మరోవైపు ఈ భూమి వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులను వివరాలు కోరారు. అయితే రీ సర్వే నిర్వహించిన అనంతరం తాము సమగ్ర వివరాలు వెల్లడిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కాసేపట్లో....

మరిన్ని వార్తలు