ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మడ్డులపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మడ్డులపల్లికి చెందిన వంగూరి సురేష్(20), అఖిల్(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సురేష్ ఓ ప్రేవేటు కళాశాలలో బీటెక్ చదువుతుండగా..అఖిల్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.