కొడుకు లేని సమయంలో కోడలిపై మామ..

11 Oct, 2018 12:05 IST|Sakshi

సాక్షి, గూడూరు (వరంగల్‌): గూడూరు మండలంలోని రాములు తండా శివారు చిర్రకుంట తండాలో కోడలిపై మామ అత్యాచారయత్నానికి పాల్పడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిర్రకుంటతండాకు చెందిన బానోతు అనితపై ఆమె మామ మంజ్య గత ఆరునెలలుగా తన భర్త ఇంటి వద్ద లేని సమయం చూసి శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు.

ఈ నెల 7వ తేదీ రాత్రి కూడా తన భర్త ఇంట్లో లేని సమయంలో మామ తనపై అత్యాచారయత్నం చేయగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెప్పుకోవాల్సి వచ్చిందని  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు